తెలంగాణ డీజీపీ జితేందర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. నటుడు అల్లు అర్జున్ కు తాము వ్యతిరేకం కాదన్నారు. చట్ట ప్రకారమే యాక్షన్ తీసుకున్నామని చెప్పారు. ఆ రోజు సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన అత్యంత బాధాకరమని అన్నారు. కేసు కోర్టు పరిధిలో ఉందన్నారు. మోహన్ బాబుపై కేసు నమోదు చేశామని తెలిపారు. వారివి కుటుంబ గొడవలంటూ కొట్టి పారేశారు. గన్స్ తీసుకున్నామని పేర్కొన్నారు.