ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే, కలెక్టర్
NEWS Dec 21,2024 06:05 pm
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని శనివారం సాయంత్రం బోధన్ శాసన సభ్యులు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సందర్శించారు. నూతనంగా నిర్మించిన మాతాశిశు ఆరోగ్య కేంద్రం, క్రిటికల్ కేర్ యూనిట్ లతో కూడిన భవన సముదాయాన్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ఆదివారం లాంఛనంగా ప్రారంభోత్సవం చేసిన అనంతరం జీజీహెచ్ లో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాపై సమావేశం ఏర్పాటు చేశారు.