సీఎంను కలిసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్
NEWS Dec 21,2024 02:12 pm
నిజామాబాదు అర్బన్ నియోజకవర్గం అభివృద్ధికి తగిన నిధులు కేటాయించాలని అసెంబ్లీలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు.నియోజకవర్గ అభివృద్ధికి రావలిసిన పెండింగ్ నిధులు TUFIDC ఫండ్ 60 కోట్లు, నియోజకవర్గ అభివృద్ధి ఫండ్ 5 కోట్లు, స్పెషల్ ఫండ్ వంద కోట్లు వెంటనే విడుదల చేయాలని అలాగే నియోజకవర్గనికి ఇంటిగ్రెటెడ్ స్కూల్ మంజూరుకై ముఖ్యమంత్రి ఛాంబర్ లో రేవంత్ను కలిసి విన్నవించగా, సానుకూలముగా స్పందించినట్లు తెలిపారు.