బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. గడిచిన 6 గంటలుగా గంటకు 12 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదులుతోంది. ప్రస్తుతం విశాఖకు అగ్నేయంగా 430 కిలోమీటర్లు దూరంలో కేంద్రకృతమై ఉంది. చెన్నైకు ఈశాన్యంగా 480 కిలోమీటర్లు, గోపాలపురం కు దక్షిణంగా 590 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణశాఖ తెలిపింది. తమిళనాడుతో పాటు ఏపీలో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.