తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న అవినీతిపై నిగ్గు తేల్చేందుకు ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ కమిషన్ గడువు ఫిబ్రవరి వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా ఈ నెల 31 వరకే కమిషన్కు గడువు ఉండటంతో మరో రెండు నెలలు గడువు పెంచినట్లు తెలిపింది. ఫిబ్రవరి 28 వరకు గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.