ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ గా మధు మూర్తిని నియమించింది. మూడు సంవత్సరాల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. మధుమూర్తి స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి మండలం జాగర్లమూడి స్వస్థలం. ప్రస్తుతం వరంగల్ నిట్ సభ్యుడిగా కొనసాగుతున్నారు.