కార్మికులకు అవగాహన సదస్సు
NEWS Dec 21,2024 02:13 pm
తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో అవగాహన సదస్సు నిర్వహించారు.రాష్ట్ర నాయకులతో పాటు లోకల్ నాయకులు గత ఏడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులకు ఎలాంటి సహాయం అందించడం లేదన్నారు. ఈ విషయమై పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రాలు అందించినా స్పందన కరువైందన్నారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకుంటే జిల్లాల వారిగా నిరాహర దీక్షలు, సమ్మెలు చేపడతామని అన్నారు.