వచ్చే నెలలో బెంగళూరులో కాన్సులేట్ను ప్రారంభించేందుకు అమెరికా తన నిబద్ధతతో పనిచేస్తోందని భారత్లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ వెల్లడించారు. అమెరికా - ఇండియా బిజినెస్ కౌన్సిల్ నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే బెంగళూరు ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరు పొందిందని చెప్పారు. ఇక్కడి నుంచి ఎక్కువగా యుఎస్ కు వెళతారని తెలిపారు.