కోరుట్ల పట్టణంలోని నంది చౌరస్తా వద్ద శుక్రవారం ఓ వృద్ధురాలి నుంచి రెండున్నర తులాల బంగారు నగలను గుర్తుతెలియని దుండగుడు ఎత్తుకెళ్లాడు. వృద్ధురాలు నంది చౌరస్తాలో ఉండగా గుర్తుతెలియని వ్యక్తి వచ్చి ఫించన్ కోసమని మాయమాటలు చెప్పి నగలు అపహరించినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని తెలియాల్సి ఉంది.