సీఎం సహాయనిధి పేద ప్రజలకు వరం
NEWS Dec 20,2024 02:37 pm
రైల్వే కోడూరు: సీఎం సహాయనిధి పేద ప్రజలకు వరం లాంటిది అని రైల్వే కోడూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్ అన్నారు.ఈ సందర్భంగా శుక్రవారం రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన పలువురికి సుమారు 11,16,851/- రూపాయలు విలువచేసే సీఎం సహాయనిది చెక్కులను పంపిణీ చేశారు. రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.