విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పుత్తా
NEWS Dec 20,2024 02:36 pm
చెన్నూరు మండలం కొండపేట గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుల ఆహ్వానం మేరకు శుక్రవారం నూతన శివాలయం విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవంలో కమలాపురం టీడీపీ ఇంచార్జ్ పుత్తా నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.