కడప నగరంలో గల బాలికల ఉర్దూ పాఠశాలను శుక్రవారం ఎమ్మెల్యే మాధవి రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం నాణ్యతను పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు స్వయంగా అన్నదానం వడ్డించారు. పాఠశాలను అభివృద్ధి చేయడానికి కావాల్సిన అంశాలను ఎమ్మెల్యే మాధవి రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి చర్చించారు