ఫార్మూలా ఈ - రేస్ మీద ప్రభుత్వం తరపున పూర్తి స్థాయి వివరాలు సమర్పిస్తామని ప్రకటించారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ బయట పెట్టిన ఫొటోలో ఎఫ్ఈవో కంపెనీ ప్రతినిధితో ఉన్నది తానేనంటూ వెల్లడించారు అసెంబ్లీలో. ఆనాడు వాళ్లు వచ్చి చెబితేనే కేటీఆర్ బండారం బయట పడిందన్నారు. ఈ తర్వాతే ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి విచారణ చేపట్టామన్నారు. గవర్నర్ కు లేఖ రాశామన్నారు సీఎం.