ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదని హెచ్చరించారు సీఎం చంద్రబాబు నాయుడు. తేమ శాతంలో కచ్చితత్వం ఉండాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే అకౌంట్లో డబ్బులు జమ అవుతున్నాయని అన్నారు. పంటకు డిమాండ్ రావాలంటే వినియోగం పెరగాలని సూచించారు సీఎం.