రాజకీయ కక్షతోనే కేటీఆర్ పై కేసు
NEWS Dec 20,2024 11:32 am
కక్ష సాధింపుతోనే మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు చేశారని ఆరోపించారు కేటీఆర్ లాయర్ సుందరం. తనపై ఏసీబీ కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్బంగా తీవ్ర వాదోపవాదనలు చోటు చేసుకున్నాయి. అసలు కేటీఆర్ కు ఈ కేసుతో సంబంధం లేదని, ఎక్కడ లబ్ది పొందారో చెప్పాలన్నారు. 11 నెలల తర్వాత కేసు ఎలా నమోదు చేస్తారంటూ ప్రశ్నించారు.