విశాఖ డెయిరీ చైర్మన్ రాజీనామా
NEWS Dec 20,2024 10:21 am
వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. విశాఖ డెయిరీ చైర్మన్ గా ఉన్న ఆనంద్ కుమార్ తో పాటు మరో 9 మంది డైరెక్టర్లు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి తమ రాజీనామా పత్రాలు సమర్పించారు. డెయిరీ అభివృద్ది కోసం తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో వైసీపీకి క్యూ కట్టారు నేతలు.