బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ చరిత్రలో ఇది చీకటి రోజు అని అన్నారు. ఓ కుటుంబం కోసమే బీఆర్ఎస్ ఆందోళన చేపడుతోందన్నారు. బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇదే బీఆర్ఎస్ సంస్కృతి. కేసీఆర్ నేర్పించింది ఇదే అంటూ మండిపడ్డారు. ఒక ఎమ్మెల్యే కోసమే ఇదంతా చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.