సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నిర్మల్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె నేటితో 11 వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా కాంటాక్ట్ ఉద్యోగ ఉపాధ్యాయులు రోడ్లు ఊడుస్తూ నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించడంలో జాప్యం చేస్తున్నారని అన్నారు.