నవ్యాంధ్ర నిర్మాణంలో ఏసిఈ సంస్థ కీలక పాత్ర పోషించాలి
NEWS Dec 20,2024 09:38 am
నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో యాక్షన్ కన్స్ట్రక్షన్స్ ఎక్విప్మెంట్స్(ఏ.సి.ఈ)కంపెనీ కీలకపాత్ర పోషించాలని మైలవరం MLA వసంత వెంకట కృష్ణప్రసాదు ఆకాంక్షించారు. ఇబ్రహీంపట్నంలోని ఐశ్వర్య గ్రాండ్స్ అపార్ట్ మెంట్స్ లో సహస్రిక ఆటోమొబైల్స్ (ఏ.సి.ఈ ఆదరైజ్డ్ డీలర్స్) ను శాసనసభ్యులు కృష్ణప్రసాదు ప్రారంభించారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్రసాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయన్నారు.