మల్యాల క్రాస్ రోడ్ వద్ద గల బస్ షెల్టర్ లో పార్కింగ్ చేసిన ప్రైవేట్ వాహనాలను పోలీసులు ఠాణాకు తరలించారు. వాహనాలు పార్కింగ్ చేయడం వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని, వాహనాలు నిలుప వద్దని బారికేడ్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వాహనదారులను పలు మార్లు హెచ్చరించిన ఫలితం లేకపోవడంతో బస్ షెల్టర్ లో నిలిపిన వాహనాలను పోలిస్ స్టేషన్ కు తరలించామని ఎస్సై నరేష్ కుమార్ తెలిపారు.