విద్యార్థులకు అండగా ఉంటాం మార్కెట్ చైర్మన్ కూన గోవర్ధన్
NEWS Dec 20,2024 09:35 am
గురుకుల విద్యార్థులకు అండగా ప్రభుత్వం ఉంటుందని.గురుకులాల్లో అన్ని వసతులు కల్పిస్తామని మెట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ అన్నారు. టిపిసిసి డెలిగేట్ మెంబర్ కల్వకుంట్ల సుజీత్ రావు ఆదేశాల మేరకు పెద్ధపూర్ గురుకుల పాఠశాలను మెట్పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ ఖుతుబోద్దీన్ పాషాతో కలిసి సందర్శించారు. పాఠశాలలో సౌకర్యాల గురించి విద్యార్థులను, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఉపాధ్యాయులను కోరారు