రోడ్ల నిర్మాణం అభివృద్దికి సోపానం
NEWS Dec 20,2024 05:14 am
తమ ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికి ప్రయారిటీ ఇస్తోందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. విశాఖ నుంచి పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనకు వెళ్లారు. గిరిజన గ్రామాలకు రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టనున్నారు .19 నూతన రోడ్లకు శంకుస్థాపనలు చేస్తారు. దాదాపు 36.71 కోట్ల వ్యయంతో, 39.32 కి.మీ. మేర నూతన రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు.