కేటీఆర్ ను అరెస్ట్ చేసేందుకు దూకుడు పెంచింది ఏసీబీ. ఫార్ములా ఈ-కార్ రేస్ విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేశారు. ఏసీబీలో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ( CIU) ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక బృందానికి డైరెక్టర్ గా తరుణ్ జోషి బాధ్యతలు తీసుకున్నట్లు సమాచారం. ఏసీబీ డీజీ విజయ్ కుమార్ ఈ కేసును మానిటరింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. HMDA తో పాటు పలు శాఖల నుంచి కీలక ఫైల్స్ తెప్పించుకుంది ఏసీబీ.