వేద పరిరక్షణకు టీటీడీ విశేష కృషి
NEWS Dec 20,2024 03:33 am
వేద విద్యా వ్యాప్తికి, వేద పరిరక్షణకు టీటీడీ విశేష కృషి చేస్తోందన్నారు టీటీడీ ఈవో శ్యామలరావు. తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వ విద్యాలయ కార్యకలాపాలపై సమీక్ష చేపట్టారు. ఎస్వీ వేద విశ్వ విద్యాలయాన్ని టీటీడీ 2006లో ప్రారంభించిందన్నారు. అప్పటి నుండి వేద విద్యలో ఉన్నత స్థాయి పరిశోధనలు జరిగాయన్నారు. వేద పరిశోధనలో భాగంగా వేదాల్లో ఉన్న విజ్ఞానాన్ని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.