తిరుమల విజన్ 2047 కు ఆహ్వానం
NEWS Dec 20,2024 03:08 am
స్వర్ణాంధ్ర విజన్ – 2047కి అనుగుణంగా తిరుమలలో ప్రణాళికా బద్ధమైన అభివృద్ధి, పర్యావరణ నిర్వహణ, వారసత్వ పరిరక్షణపై దృష్టి సారించే వ్యూహాత్మక ప్రణాళికతో తిరుమల విజన్ – 2047 ను టీటీడీ ప్రారంభించింది. ఈ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రఖ్యాత ఏజెన్సీలను ఆహ్వానిస్తూ ప్రతిపాదనల కోసం ఆర్ఎఫ్పీని విడుదల చేసినట్లు తెలిపారు ఈవో శ్యామల రావు.