భారత రాజ్యాంగాన్ని అమలు చేయాలి: విశారదన్ మహారాజ్
NEWS Dec 19,2024 06:18 pm
మల్యాల కేంద్రంలోని స్థానిక అంగడి బజార్లో గురువారం నిర్వహించిన ధర్మ సమాజ్ పార్టీ ధర్మ యుద్ధం సభకు రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో 90% వున్న BC, SC, ST, RM ల రాజ్యం కోసం, భారత రాజ్యాంగాన్ని అమలు చేయడం కోసం DSP పార్టీ ధర్మ యుద్ధం ప్రారంభించిందన్నారు. ఈ యుద్ధంలో అందరు భాగస్వాములై, మన తరాలకు దారి చూపాలని పిలుపునిచ్చారు. కుల సంఘాల పెద్దలు, DSP నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.