చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శిగా మల్లేశం
NEWS Dec 19,2024 06:18 pm
తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శిగా మల్యాల కేంద్రానికి చెందిన గాజుల మల్లేశంను నియమిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ తెలిపారు. పద్మశాలి జాతి శ్రేయస్సు కోసం, చేనేత వృత్తి పరిరక్షణకు అహర్నిశలు కృషి చేయాలని ఆశిస్తూ మల్లేశంకు నియామక పత్రాన్ని అందజేసి, అభినందనలు తెలియజేశారు. తన నియామకానికి సహకరించిన కుల బాంధవులకు, రాష్ట్ర కార్యవర్గానికి మల్లేశం కృతజ్ఞతలు తెలియజేశారు.