మెట్ పల్లి డిపో పరిధిలో శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ దేవరాజన్ తెలిపారు. మెట్ పల్లి డిపో పరిధిలో గల ప్రయాణికులు 9959225927 నంబర్కు కాల్ చేసి సమస్యలను తెలుపాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని మీ యొక్క సమస్యలను తెలిపి డిపో అభివృద్ధికి సలహాలు, సూచనలను అందించాలని కోరారు.