స్వచ్ఛతలో కోరుట్ల కు చేంజ్ మేకర్స్ అవార్డు
NEWS Dec 19,2024 02:25 pm
కోరుట్ల మున్సిపాలిటీకి అరుదైన గౌరవం దక్కింది. కమిషనర్ బట్టు తిరుపతి గారు న్యూ ఢిల్లీలోని కేంద్ర విజ్ఞాన కేంద్రం (సెంటర్ ఫర్ సెన్స్ అండ్ ఎన్విరాన్మెంట్-సీఎస్ఈ), హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించనున్న చేంజ్ మేకర్స్ కాన్దేక్లేవ్లో పాల్గొనే అవకాశం అందుకున్నారు. హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ జాయింట్ సెక్రటరీ రూపామిశ్రా,నేషనల్ మిషన్ డైరెక్టర్, ఇతర ఉన్నతాధికారులు, కోరుట్ల మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మహేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.