రహదారిపై తల్లితండ్రుల రాస్తారోకో
NEWS Dec 19,2024 02:33 pm
మెట్పల్లి: మండలం పెద్దాపూర్ గురుకులంలో జరిగిన సంఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మెట్పల్లి, కోరుట్ల జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి మాట్లాడారు. సంఘటనలు జరిగిన సమయంలో అధికారులను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం చేతులు దులుపుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.