అంబేద్కర్ విగ్రహంకు పాలాభిషేకం
NEWS Dec 19,2024 02:27 pm
డా. బీఆర్ అంబేద్కర్ను కించపరిచే విధంగా మాట్లాడిన అమిత్ షా దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని దళిత సంఘాల ఐక్య వేదిక నాయకులు డిమాండ్ చేశారు. దళిత సంఘాల ఐక్యవేదిక బెల్లంపల్లి పట్టణ ఉపాధ్యక్షులు మద్దెల గోపి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహంకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రత్నం ఐలయ్య, వెల్తూరి శంకర్, ఆశాది మధు, సబ్బాలి రాజనర్సు, బందల మురళి, ఉండ్రాల మల్లయ్య, దాసరి బానయ్య, అడ్డూరి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.