క్రికెట్ టోర్నీ వాల్ పోస్టర్ ఆవిష్కరణ
NEWS Dec 19,2024 02:25 pm
మల్యాల మండల కేంద్రంలో వడ్డేపల్లి అనురాధ జ్ఞాపకార్థం త్వరలో నిర్వహించబోయే మండల స్థాయి క్రికెట్ టోర్నీ (MMPL సీజన్-2) పోటీలకు సంబంధించిన వాల్ పోస్టర్ ను మండల ప్రజా ప్రతినిధులు గురువారం ఆవిష్కరించారు. టోర్నీ నిర్వాహకుడు శశాంక్ మాట్లాడుతూ.. ఈ టోర్నీలో 8 ప్రాంచయిజీలకు గాను 8 టీంలు ఉంటాయన్నారు. అలాగే టోర్నీ ని ప్రారంభించే తేదీలను త్వరలో తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిరెడ్డి, సుదర్శన్, ప్రసాద్, శ్రావణ్, రాజేశ్వర్, తిరుపతి, మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.