మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మాధవి లతను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ సత్యప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. గురుకులంలో విద్యార్థులు పాము కాటుకు గురి కావడంపై సీరియస్ అయ్యారు. గురుకులం నిర్వహణలో ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంగా ఉన్నట్టు అధికారుల విచారణలో తేలడంతో ఆమెపై చర్యలు తీసుకున్నారు కలెక్టర్.