సర్వ శిక్ష అభియాన్ లో పని చేస్తున్న ఉద్యోగుల ఆందోళనకు మద్దతు ఇచ్చారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. సర్వ శిక్ష అభియాన్ లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. బోనాల ర్యాలితో నిరసన వ్యక్తం చేస్తూ ఎల్లమ్మ దేవాలయంలో బోనాలను సమర్పించారు. వేలాది మంది చాలీ చాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.