బీజేపీ..కాంగ్రెస్ ఎంపీల తోపులాట
NEWS Dec 19,2024 07:08 am
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అమిత్ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. పార్లమెంటు ఆవరణలో నిరసనలు చేపట్టింది. ఈ సందర్బంగా బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒడిశా ఎంపీ ప్రతాప్ చంద్ర కింద పడడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.