కోరుట్ల: ఇసుక ట్రాక్టర్లను అడ్డుకోవడంతో గ్రామస్థులపై ఇసుక మాఫీయా దాడికి పాల్పడినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ ఘటన కోరుట్ల మండలం కల్లూరు శివారులో జరిగింది. సమాచారం అందుకున్న పోలీస్, రెవెన్యూ అధికారులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. విచారణలో సుమారు 50 ట్రిప్పుల ఇసుక డంపులను గుర్తించి, రెండు ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు ఎమ్మార్వో కిషన్ తెలిపారు.