బాసర పుణ్య క్షేత్రం వద్ద గోదావరి నది బ్రిడ్జి పై నుండి గోదావరిలోకి దూకి తరచూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బాసర బ్రిడ్జిపై నుంచి కుటుంబాలతో సహా ఆత్మహత్యలు జరిగిన సంఘటనలు ప్రతి ఒక్కరినీ కలచివేసింది. గోదావరి నదిలోకి దూకేందుకు ఆస్కారం లేకపోతే కొంత సమయం గ్యాప్ దొరకడంతో ఆత్మహత్యకు పాల్పడిన వారు తన నిర్ణయాన్ని మార్చుకుంటారని పోలీసుల అభిప్రాయం. అందులో భాగంగా పుణ్యక్షేత్రమైన ఇక్కడ ఇలా ఆత్మహత్యలకు ఆస్కారం లేకుండా నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల చర్యలు చేపట్టారు.