కలెక్టరేట్ ఎదుట మెప్మా ఆర్పీల నిరసన
NEWS Dec 18,2024 05:00 pm
ఆదిలాబాద్ టౌన్మెప్మా ఆర్పీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు అగ్గిమల్ల స్వామి అన్నారు. ఆర్పీలతో కలిసి సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.ఆర్పీలకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వడంతో పాటు 7 నెలలుగా పెండింగ్ వేతనాలను విడుదల చేయాలన్నారు. 10 లక్షల ప్రమాద బీమాను అమలు చేయాలని, ఆర్పీలు చనిపోతే మట్టి ఖర్చులకు రూ. 50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పట్టణ ఆర్పీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరిష్కరించాలన్నారు.