రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రం రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కర్ను బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. రాష్ట్ర అభివృద్ధి తో పాటు ధర్మవరం అభివృద్ధికి సహకరించాలని కోరినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నుంచి తమ సహకారం ఎప్పుడూ ఉంటుంది అని నితిన్ గడ్కర్ వెల్లడించినట్లు తెలిపారు.