తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు కొనసాగుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ సర్కార్ కీలక బిల్లులను ప్రవేశపెడుతోంది. ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ముందుకు రికార్డ్ ఆఫ్ రైట్స్-ROR చట్ట సవరణ బిల్లు రాబోతోంది. సభలో ROR-2024 బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. ధరణి పోర్టల్ను భూమాతగా మార్చాలని సర్కార్ నిర్ణయించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ROR-2020 చట్టం రద్దు అవుతుంది. కొత్త చట్టం ప్రకారం భూ సమస్యల పరిష్కారానికి ల్యాండ్ ట్రైబ్యునల్స్ ఏర్పాటు చేస్తారు.