నటుడు అల్లు అర్జున్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు పీఓడబ్ల్యూ నేత సంధ్య. ఆయన దేని కోసం త్యాగం చేశాడని క్యూ కట్టారంటూ ప్రశ్నించారు. పేదల ప్రాణాలంటే లెక్క లేదా అని ప్రశ్నించారు. ఓ తల్లి చని పోయింది. మరో పిల్లాడు చావు బతుకుల మధ్య కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతుంటే పరామర్శించేందుకు మనసు రాలేదన్నారు. ఇదేనా మీ హీరోయిజం అని నిప్పులు చెరిగారు.