ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని వీధి దీపాల నిర్వహణ చేపట్టిన ప్రైవేట్ ఏజెన్సీ ఒప్పంద గడువు ఇటీవల ముగిసింది. అయితే ఆ ఏజెన్సీకి రూ.కోట్లలో పేరుకుపోయిన బకాయిలు చెల్లించకపోవడంతో గతేడాదిగా ఆ సంస్థ విద్యుత్ దీపాల సామగ్రిని సరఫరా చేయకపోగా, నిర్వహణపై చేతులెత్తిసింది. ఈ నేపథ్యంలో స్వయంగా బల్దియానే పర్యవేక్షించాల్సి వస్తోంది. నూతన ఏజెన్సీకి కేటాయించేందుకు టెండర్లు ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 20వరకు ఆన్లైన్ ద్వారా సమర్పించేందుకు అవకాశం కల్పించారు.