రైతులకు అవగాహన సదస్సు
NEWS Dec 17,2024 01:03 pm
రైతు నేస్తం ప్రోగ్రాంలో భాగంగా మంగళవారం మల్యాల రైతు వేదికలో ఎపిసోడ్ 37లో శాస్త్రవేత్తలచే రైతులకు యాసంగి పంట, సస్యరక్షణ చర్యలు, NPSS అనే అగ్రి ఆప్ గురించి రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి దేవ ప్రసాద్, మల్యాల ఏవో చంద్ర దీపక్, ఏఈవోలు మంజుల, కారుణ్య, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, మండల రైతులు పాల్గొన్నారు.