చదువు ఒక్కటే మనిషిని ఉన్నత స్థానంలో నిలబెడుతుందని, విలువలు అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ స్నాతకోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. విద్యా, వైద్యం అనేది సమాజాన్ని ప్రభావితం చేస్తాయన్నారు. ఎయిమ్స్ ను సందర్శించడం ఆనందంగా ఉందన్నారు. మీ ఆతిథ్యాన్ని మరిచి పోలేనంటూ పేర్కొన్నారు ముర్ము.