కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మంగళవారం చేతులకు బేడీలు వేసుకుని నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి వెళ్లారు. లగచర్ల గిరిజన రైతులకు సంఘీభావంగా చేతులకు బేడీలు వేసుకొని, నల్ల దుస్తులు ధరించి వెళ్లినట్లు పేర్కొన్నారు. లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు.