బిల్లుల మంజూరులో జాప్యమెందుకు
NEWS Dec 17,2024 10:39 am
రాష్ట్ర వ్యాప్తంగా సీడీపీ, ఎస్డీపీ ద్వారా చేపట్టిన చిన్నచిన్న పనులకు సంబంధించి కూడా బిల్లులను ప్రభుత్వం ఎందుకు చెల్లించట్లేదో చెప్పాలని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రానికి ఆదాయం వస్తున్నప్పటికీ బిల్లులు క్లియర్ చేయక పోవడంతో ఇబ్బందులు వస్తున్నాయన్నారు. భవనాలు, బడులు తదితర 143 పనులకు సంబంధించి రూ.6 కోట్ల బిల్లులు పెండింగులో ఉన్నాయన్నారు.