దుబాయ్ బస్సు ప్రమాదంలో భారత దేశానికి చెందిన అనేకమంది గాయపడ్డ విషయం తెలిసిందే. అయితే వారిని వీలైనంత తొందరగా భారత్కు రప్పించే విధంగా చూడాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ కేంద్ర మంత్రి జయశంకర్ ను కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన లేఖ రాశారు. బాధితుల్లో పలువురు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన వారున్నారని ఎంపీ లేఖలో పేర్కొన్నారు.