సింహాచలంలోని శ్రీ వరహలక్ష్మీ నృసింహ స్వామి ఆలయంలో నెలగంట ప్రారంభమైంది. ఆలయ స్థానాచార్యులు టిపి రాజగోపాల్ , ఉప ప్రధానార్చకులు సీతారామాచార్యులు ధనుర్మాస ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. స్వామి వారికి పూజలు నిర్వహించారు.