తిరుమలలో భక్తుల రద్దీ
NEWS Dec 17,2024 03:01 am
తిరుమల శ్రీవారిని 62,112 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,541 మంది భక్తులు తల నీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.36 కోట్లు వచ్చినట్లు ఈవో శ్యామల రావు వెల్లడించారు. ప్రస్తుతం 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారని, టోకెన్లు లేని భక్తులకు సర్వ దర్శనానికి కనీసం 12 గంటలకు పైగా సమయం పడుతుందని తెలిపారు.