నిశ్శబ్ద యుద్ధం కవితా సంపుటి ఆవిష్కరణ
NEWS Dec 14,2024 03:25 pm
మెట్పల్లి పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీ పెరంబదూర్ లింబగిరి స్వామి రచించిన నిశ్శబ్ద యుద్ధం కవితా సంపుటిని ప్రముఖ సినీ గేయ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత సుద్దాల అశోక్ తేజ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి దాస్యం సేనాధిపతి, నాట్యాచార్యులు తిరుక్కోవెల లక్ష్మణస్వామి, గండ్ర ఆనందరావు, దురిశెట్టి మనోహర్, శివాజీ, శరత్ చంద్ర, కేశవ స్వామి, శ్రీనివాస స్వామి తదితరులు పాల్గొన్నారు.